సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం

గత కొద్దీ రోజులుగా హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. భారీగా ఆస్థి నష్టం తో పాటు ప్రాణ నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే పలు సంఘటనలు చోటుచేసుకోగా..ఆదివారం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

రైల్వేస్టేషన్‌ వద్ద ఉన్న అశోక లాడ్జిలో ఆదివారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వంటగదిలో ప్రారంభమైన మంటలు క్రమంగా హోటల్‌ మొత్తానికి వ్యాపించాయి. దీంతో పెద్దఎత్తున్న అగ్నికీలలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.