భారత్‌లో ఒక్కరోజులోనే 1000కిపైగా కరోనా కేసులు

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడి

corona virus
corona virus

దిల్లీ: భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1,035 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా నమోదు అయిన కరోనా కేసుల సంఖ్య 7,447 కు చేరింది. ఒక్కరోజులోనే ఈ వైరస్‌ కారణంగా దేశంలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 239 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. కాగా దీనిబారినుండి ఇప్పటి వరకు 643 మంది కోలుకోగా .. 6,565 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/