ఏడాది బిడ్డను సీఎం వేదికపైకి విసిరేసిన తండ్రి..ఎందుకో తెలిస్తే అయ్యో అనాల్సిందే

మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సాగర్‌లో జరిగిన ఓ సభలో అనూహ్య ఘటన జరిగింది. ఓ తండ్రి ఏడాది వయసున్న తన కుమారుడిని వేదికపైకి ఒక్కసారిగా విసిరాడు. ఈ ఘటన తో అంత షాక్ అయ్యారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బహిరంగ సభ జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలు ఈ సభకు తరలి వచ్చారు. ముకేశ్ పాటేల్ అనే వ్యక్తి ఓ దినసరి కూలీ. అతను కూడా ఈ సభకు భార్య నేహ, ఏడాది వయసు కుమారుడు నరేశ్ తో కలిసి వచ్చాడు. సీఎం మాట్లాడుతుండగా..ఒక్కసారిగా ముకేశ్ పాటేల్ ..తన ఏడాది వయసున్న కుమారుడ్ని స్టేజ్ పైకి విసిరాడు.

అయితే, తాను ఎందుకు విసిరేశానో పటేల్ స్థానిక మీడియాకు తెలిపాడు. తన కుమారుడు నరేశ్ కు గుండెలో చిల్లు ఉందని, అందుకు వైద్యం చేయించానికి అయ్యే ఖర్చు భరించే స్తోమత తనకు లేదని వాపోయాడు. అందుకే ముఖ్యమంత్రికి ఆ విషయం తెలియాలనే ఉద్దేశంతో తనకు ఇష్టం లేకపోయినా తన కొడుకుని వేదికపైకి సున్నితంగా విసిరేసినట్లుగా చెప్పాడు. అయితే, చిన్నారి బాలుడ్ని వేదికపైకి విసిరివేయడం చూసి దిగ్భ్రాంతికి లోనైన భద్రతా సిబ్బంది ఏడుస్తున్న ఆ బిడ్డను ఎత్తుకుని అతని తల్లికి అప్పగించారు.

ఈ విషయం అక్కడే ఉన్న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చూడడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. తన వెంట ఉన్న అధికారుల ద్వారా అన్ని వివరాలు తెలుసుకున్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి అధికారులు సీఎంకు వివరించారు. దీంతో ఆ బాలుడికి అన్ని విధాలుగా ఆరోగ్యపరంగా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు బాలుడి ఆరోగ్యానికి సంబంధించిన వివరాల నివేదికను పంపాల్సిందిగా కలెక్టర్ ను ఆదేశించారు.