కొత్త చిత్రాన్ని ప్రారంభించిన సుడిగాలి సుధీర్

జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ బుల్లితెర కు పరిచయమయ్యారు. ఈ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్..వెండితెర ఫై రాణిస్తున్నారు. అలాంటి వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు. అయితే ఇప్పుడు సుడిగాలి సుధీర్ వరుసగా హీరోగా సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా గాలోడు మూవీ తో మాస్ హిట్ కొట్టిన సుధీర్..శనివారం కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు.

మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ లో నరేష్ కుప్పిలి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రం సుధీర్ కు నాల్గో చిత్రం కావడం విశేషం. రామానాయుడు స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. పాగల్ మూవీతో నరేష్ కుప్పిలి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇది అతనికి రెండో మూవీ కావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ మూవీతో తమిళ్ బ్యూటీ దివ్య భారతి టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెడుతోంది.