మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో విషాదం

మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో విషాదం చోటుచేసుకుంది. రైలు ఎక్కేందుకు వచ్చిన ప్రయాణికుడు..సడెన్ గా గుండెనొప్పి వచ్చి..అక్కడిక్కడే మృతి చెందాడు. ఇటీవల కాలంలో చాలామంది గుండెనొప్పి తో కన్నుమూస్తున్నారు. ఒకప్పుడు 60 ఏళ్ల పైబడిన వారు ఎక్కువగా గుండెనొప్పితో చనిపోయేవారు..కానీ కరోనా తర్వాత వయసుతో సంబంధం లేకుండా గుండె నొప్పితో మరణిస్తూ వస్తున్నారు.

ఇప్పటికే ఎంతో మంది ఇలాగే చనిపోగా..తాజాగా మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో తన భార్య పిల్లలతో కలిసి రైలు ఎక్కేందుకు స్టేషన్‌కు వచ్చిన రాంబాబు..సడెన్ గా ఛాతిలో నొప్పి అంటే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో కంగారు పడిన అతడి భార్య కేకలు వేయగా.. స్థానికులు వచ్చి అతడికి సీపీఆర్ చేసినా లాభం లేకుండా పోయింది. దీంతో రాంబాబు స్పాట్‌లోని చనిపోయాడు. అయితే, రాంబాబుకు గుండెపోటు రాగా సాటి ప్రయాణికులు అతడికి సీపీఆర్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.