ఆస్తి కోసం తల్లినే చంపిన కిరాతకుడు

నవమాసాలు మోసి, కని పెంచిన తల్లి అంటే సమాజంలో ఎంతో గౌరవం.. అందుకే తల్లిని మాతృదేవోభవ అంటారు. అంటే తల్లి దేవుడితో సమానం అని అర్థం..అలంటి తల్లినే ఆస్తి కోసం చంపేశాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన హైదరాబాద్ లోని రామంతాపూర్ లో చోటుచేసుకుంది. రామంతపూర్ లో సుగుణమ్మ, కొడుకు అనిల్ కోడలు తిరుమల నివాసం ఉంటున్నారు. సుగుణమ్మ పేరు మీద ఇల్లు ఉండడంతో ఆ ఇల్లును అమ్మాలని చూశారు కొడుకు, కోడలు.

కానీ సుగుణమ్మ ఇల్లు అమ్మడానికి ఒప్పుకోకపోవడంతో భార్య, తన స్నేహితుడితో కలిసి తల్లి సుగుణమ్మను హత్య చేశాడు కొడుకు అనిల్‌. అయితే, అంత్యక్రియల సమయంలో బంధువులకు అనుమానం రావడంతో విషయం బయటపడింది. అనంతరం రంగంలోకి దిగిన ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.