నేడు ప్రధాని మోడీ , ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్ భేటీ

వర్చువల్ గా సమావేశం..ద్వైపాక్షిక వాణిజ్యంపై చర్చలు

PM Modi, Morrison to hold second India-Australia virtual summit today

న్యూఢిల్లీ: నేడు భారత ప్రధాని మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. వర్చువల్ గా నిర్వహించే ఈ భేటీలో భారత్ లో రూ.1,500 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలను మారిసన్ ప్రకటించనున్నారు. టెక్నాలజీ, క్రిటికల్ మినరల్స్ తదితర రంగాల్లో ఆస్ట్రేలియా పెట్టుబడులు పెట్టనుంది. ఇరు దేశాల మధ్య ఇది రెండో వర్చువల్ ద్వైపాక్షిక సమావేశం కానుంది. 2020 జూన్ 4న తొలి సమావేశం జరిగింది. ‘‘ప్రధాని మోడీతో వాణిజ్యం, పెట్టుబడుల బంధాన్ని బలోపేతం చేసుకోవడంపై చర్చించనున్నాం. ఇరు దేశాల పరస్పర ఆర్థిక ప్రయోజనాలు, ఆర్థిక వృద్ధిపై దృష్టి సారించనున్నాం’’ అంటూ ఈ సమావేశానికి ముందు స్కాట్ మారిసన్ ప్రకటించారు. ఇరుదేశాల మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం దిశగా ఏవైనా అడుగులు పడతాయేమో చూడాలి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/