నార్కట్‌పల్లి లో మరో ఘోర రోడ్డు ప్రమాదం

నార్కట్‌పల్లి ..ప్రమాదాలకు కేరాఫ్ గా మారుతుంది. నిత్యం విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారి ఫై రక్తం చిందిస్తూనే ఉంది. ప్రతి రోజు ఈ రూట్లో ప్రమాదాలు జరుగుతూ..అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా నార్కట్‌పల్లి మండలం గోపలాయపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.

విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ.. గోపలాయపల్లి వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హాస్పటల్ కు తరలించారు. ఈ ప్రమాదం తో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.ప్రస్తుతం లారీని క్రేన్‌ సహాయంతో తొలగించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.