ఏపీలో బిజెపి భారీ సభలు..

బిజెపి అధిష్టానం తెలుగు రాష్ట్రాల ఫై ఫోకస్ పెట్టింది. ఎలాగైనా ఈ రెండు రాష్ట్రాల్లో కాషాయం జెండా ఎగురవేయాలని చూస్తుంది. ఇప్పటికే తెలంగాణ లో పలు సభలు ఏర్పాటు చేసిన అధిష్టానం..ఇప్పుడు ఏపీ లో భారీ సభలు నిర్వహించాలని చూస్తుంది. ఈ క్రమంలో రెండు రోజుల వ్యవధిలో రెండు సభలు పెడుతున్నారు. అమిత్ షా విశాఖలో, బీజేపీ అధ్యక్షుడు నడ్డా తిరుపతిలో సభలు పెడుతున్నారు.

ఈ ఇద్దరు నేతల బహిరంగసభలపై ఈ సారి రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తమ పార్టీ నేతలకు వారు రోడ్ మ్యాప్ ఇస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది. జనసేన పార్టీ మాతోనే ఉందని బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు చెబుతున్నారు. కానీ జనసేన మాత్రం తాము టీడీపీతో ఉన్నామన్న సంకేతాలు ఇస్తున్నారు. మరి ఈ సభల్లో పొత్తులపై ఓ క్లారిటీ వస్తుందని అంత భావిస్తున్నారు.