ఖమ్మం జిల్లాలో విషాదం..8 మందిపై పిడుగుపాటు

తెలంగాణ రాష్ట్రాల్లో రెండు రోజులుగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ఖమ్మం జిల్లాలో విషాదం నింపాయి. ఖమ్మం జిల్లా తిరుమలాయపల్లి (మం) దమ్మాయిగూడెంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న 8 మంది కూలీలపై పిడుగు పడింది.

ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడడంతో కూలీలంతా పక్కనే ఉన్న వేప చెట్టు కిందకు చేరారు. ఇంతలోనే భారీ శబ్దంతో పిడుగు ఒక్కసారిగా పడడంతో 8 మంది కూలీలు పిడుగుపాటుకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పరిస్థితి విషమం ఉండగా.. మిగతా వారికి గాయాలు అయినట్లు తెలిసింది. ప్రస్తుతం వీరంతా ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.