ఈ నలుగురు గుజరాతీయులది భారత దేశ ఆధునిక చరిత్రలో కీలక పాత్రః హోం మంత్రి అమిత్ షా
గాంధీనగర్ః శ్రీ ఢిల్లీ గుజరాతీ సమాజ్ ఏర్పాటయ్యి 125 ఏళ్లు పూర్తయని సందర్భంగా గురువారం జరిగిన కార్యక్రమానికి హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ..‘‘మహాత్మా గాంధీ , సర్దార్ వల్లభాయ్ పటేల్, మోరార్జీ దేశాయ్, నరేంద్ర మోడీ..ఈ నలుగురు గుజరాతీలు భారత దేశ ఆధునిక చరిత్రలో కీలక పాత్ర పోషించారు’’ అని వ్యాఖ్యానించారు.
మహాత్మా గాంధీ వల్ల దేశానికి స్వాతంత్ర్యం వస్తే, సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశాన్ని ఏకం చేశారని అమిత్ షా వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని మోరార్జీ దేశాయ్ పునరుత్తేజితం చేశారని, నరేంద్ర మోడీ కారణంగా భారత దేశ పేరు ప్రతిష్ఠలు ప్రపంచవ్యాప్తమయ్యాయని హోం మంత్రి వ్యాఖ్యానించారు. గుజరాతీయులు దేశంతో పాటూ ప్రపంచమంతటా ఉన్నారని, స్థానికులతో కలిసిపోతూ సామాజిక అభ్యున్నతికి వారు పాటుపడతారని ఆయన వ్యాఖ్యానించారు.