నన్ను ఏ చట్టం కింద వెళ్లిపొమ్మని చెబుతున్నారు?
ఎన్ కౌంటర్ చేసినా వెనుదిరిగి వెళ్లేది లేదు
విశాఖ: టిడిపి అధినేత చంద్రబాబు వైజాగ్ ఎయిర్ పోర్టు వద్ద తనను వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నిలువరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ప్రశాంతమైన నగరం అని, కానీ ఈ నగరాన్ని వైఎస్ఆర్సిపి నేతలు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ’40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. 25 ఏళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశా. ప్రతిపక్ష నాయకుడిగా ఇది పదకొండో సంవత్సరం. దేనికి నన్ను అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలి. కాగితంపై రాసి ఇవ్వండి. మీరు పోలీసులో కాదో ఎవరికి తెలుసు? నన్ను ఏ చట్టం కింద వెళ్లిపొమ్మని చెబుతున్నారు? పోలీసులు ఉద్యోగం కోసం కక్కుర్తి పడొద్దు. ఇక్కడున్న పోలీసుల వద్ద ఒక్కరికీ ఐడెంటిటీ లేదు. ఐడెంటిటీ లేకుండా ఉద్యోగాలు చేయాల్సినంత పిరికితనం ఎందుకు? తనను ఎన్ కౌంటర్ చేసినా వెనుదిరిగి వెళ్లేది లేదని, అనుమతి తీసుకునే వచ్చానని ఉద్ఘాటించారు. ఓవైపు చంద్రబాబు మీడియాతో ఆవేశంగా మాట్లాడుతుండగా, మరోవైపు జై జగన్ అంటూ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/