15 ఏళ్లు YCP అధికారంలో ఉంటే ఏపీ నం.1 – లక్ష్మీ పార్వతి

రాబోయే 15 ఏళ్లు వైసీపీ అధికారంలో ఉంటే ఏపీ ప్రపంచంలోనే నంబర్ 1గా ఉంటుందని తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ లక్ష్మీ పార్వతి అన్నారు. మహిళలకు ఆస్తిహక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కింది. మహిళల కోసం తొలిసారిగా పద్మావతి యూనివర్శిటీని స్థాపించారాయన. అలాగే.. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించారు. ఎన్టీఆర్ తర్వాత మహిళల సాధికారితకు కృషి చేసింది వైయ‌స్ఆర్‌ .. ఇప్పుడు జగన్. దేశంలో మహిళలకు అన్నిరంగాల్లో పెద్దపీట వేస్తున్న ఏకైక సీఎం జగన్‌ ఒక్కరే. అందుకే ప్రజలు మంచి మనసుతో ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి.. జగన్ ఒక వ్యవస్థ.

వయసులో చిన్నవాడే అయినా ఆయన ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి. అణగారిన వర్గాలకు గుర్తింపునిచ్చిన వ్యక్తి. పేదలు…మహిళల అభ్యున్నతికి ఒక మహర్షిలా పాటు పడుతున్నారు. భారతదేశ చరిత్రలో విద్యకు ఇంత ప్రాధాన్యం ఇచ్చిన ఒకే ఒక్కరు జగన్. అందుకే జగన్ చేస్తున్న మంచి పనులను మనమంతా అందరికీ చెప్పాలి. రాబోయే 15 ఏళ్లపాటు ఇదే ప్రభుత్వం ఉంటే ప్రపంచంలోనే ఏపీ నెంబర్ వన్ గా నిలుస్తుంది అని లక్ష్మి పార్వతి చెప్పుకొచ్చారు.

‘మహిళా సాధికారతకు సీఎం జగన్ కృషి చేస్తున్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నారు. చంద్రబాబు ముసలోడైపోయాడు. అందుకే లోకేష్ ను సీఎం చేయాలని చూస్తున్నాడు. అల్లుడి బాగోతం అత్తగా నాకే తెలుసు. చంద్రబాబుకి అధికారం ఇస్తే ఏపీని దోచేస్తాడు’ అని మండిపడ్డారు.