పార్టీ నేతలతో సీఎం జగన్ భేటీ..

cm-jagan-siddam-sabha-in-denduluru-today

సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ ముఖ్య నేతలు, ఐప్యాక్ టీమ్ తో భేటీ అయ్యారు. సిద్ధం సభలకు వస్తోన్న స్పందన, ఎన్నికల ప్రణాళికలు, అభ్యర్థుల మార్పులపై చర్చిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రచారం, నిర్వహించాల్సిన సభలు, విపక్షాల విమర్శలను తిప్పికొట్టడంపై సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో చేయాల్సిన కార్యక్రమాలపై సమాలోచనలు చేస్తున్నారు.

ఏపీలో మరో రెండు నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్ గెలుపు ఫై మరింత ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో ఎలాగైతె విజయం సాధించామో..దానికి రెట్టింపు విజయం ఈసారి సాధించాలని చూస్తుంది. 175 కు 175 సాధించాలని ప్రణాళికలు చేస్తుంది. ఇప్పటీకే పలు సర్వేల ఆధారంగా కొంతమందికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్స్ ఇవ్వకపోవడం , నియోజకవర్గాల మార్పులు , చేర్పులు చేస్తూ వస్తున్నారు. మరోపక్క ప్రచారం కూడా ముమ్మరం చేసారు.