జ‌గ‌న్ మూడేళ్లలో ఏంచేశారో చెప్పాలి : పురందేశ్వ‌రి

అమరావతి: ఉత్త‌రాంధ్ర‌లో జ‌లాల కోసం బిజెపి జ‌న‌పోరు యాత్ర‌ను ప్రారంభించారు బిజెపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పురందేశ్వ‌రి. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ .. ప్రాజెక్టులు, నిర్వాసితుల అంశాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు అన్యాయం చేశారు సరే… న్యాయం చేస్తానన్న జగన్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఏంచేశారో చెప్పాలని నిలదీశారు. నిర్వాసితులకు న్యాయం చేస్తామని జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. జగన్ ఎందుకు ముఖం చాటేస్తున్నారో చెప్పాలన్నారు.

వైస్సార్సీపీ సర్కారు వంశధార నిర్వాసితులను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. 16 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు పూర్తికాకుండా ఉందని అన్నారు. వంశధార ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులు వలస వెళుతున్నారని పురందేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రాజెక్టులపై తమకు అవగాహన ఉందని, ఇక్కడి నేరడి ప్రాజెక్టు కోసం ఒడిశాతో వివాదం ఉందని తెలిపారు. నిర్వాసితులను రాజకీయ ప్రయోజనాల కోసం నమ్మించి ముంచారన్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/