తెలంగాణ బిజెపి నేత సత్యవతి కన్నుమూత..

తెలంగాణ బిజెపి పార్టీ లో విషాదం చోటుచేసుకుంది. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి గుండెపోటు తో కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి సత్యవతి బిపి లెవెల్స్ పడిపోయి, గుండెపోటుకు గురికావడం తో వెంటనే కుటుంబ సభ్యులు భద్రాచలం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.

2009 సంవత్సరంలో భద్రాచలం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత బిజెపి పార్టీలో చేరిన సత్యవతి.. ఇప్పటివరకు ఎమ్మెల్యే కాలేకపోయారు. ఇక తాజాగా ఆమె గుండెపోటుతో మరణించడంతో బిజెపి పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈమె మృతి పట్ల బిజెపి నేతలు, ఇతర రాజకీయ నాయకులు సంతాపం తెలుపుతున్నారు.