బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు : మోడీకి కేటీఆర్ ట్వీట్

గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని విజ్ఞప్తి

KTR tweet to Modi
KTR tweet to Modi

Hyderabad: పార్లమెంటు లో బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.. ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారని, ప్రతి భారతీయుడికి ఇల్లు నిర్మించి ఇస్తామని గతంలో కేంద్రం ఇచ్చిన హామీలను మరోసారి గుర్తు చేయాలనుకుంటున్నానని పేర్కొన్నారు. ఇంటింటికీ నీరు, విద్యుత్, టాయిలెట్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అంతే కాకుండా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలని కేటీఆర్ కోరారు. హామీలకు న్యాయం చేసేలా బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు ఉంటాయని ఆశిస్తున్నట్టు ట్వీట్ చేశారు.

వాణిజ్య వార్తల కోసం: https://www.vaartha.com/news/business/