19 నుంచి పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు

న్యూఢిల్లీ : పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల ప్రారంభం కానున్న నేప‌థ్యంలో లోక్‌స‌భ స్పీక‌ర్ ఓంబిర్లా ఇవాళ ఏర్పాట్లను ప‌ర్య‌వేక్షించారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన స్పీక‌ర్‌.. ఈ నెల 19 నుంచి పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం కానున్నాయ‌ని స్పీక‌ర్ ఓంబిర్లా ప్ర‌క‌టించారు. జూలై 19 నుంచి ఆగ‌స్టు 13 స‌మావేశాలు కొన‌సాగుతాయ‌ని ఆయ‌న తెలిపారు. ఆ రెండు తేదీల మ‌ధ్య మొత్తం 19 ప‌నిదినాల్లో ఉభ‌య‌స‌భ‌ల కార్య‌క‌లాపాలు జ‌రుగుతాయ‌ని చెప్పారు.

కొవిడ్ నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి వ‌చ్చే ఎంపీలు, మీడియా ప్ర‌తినిధులు అంద‌రినీ పార్ల‌మెంటు లోప‌లికి అనుమ‌తిస్తార‌ని స్పీక‌ర్ ఓం బిర్లా స్ప‌ష్టంచేశారు. ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష రిపోర్టు త‌ప్ప‌నిస‌రి కాద‌ని చెప్పారు. అయితే ఇప్ప‌టికీ వ్యాక్సిన్ వేయించుకోని వారు మాత్రం ద‌య‌చేసి వ్యాక్సిన్‌లు వేయించుకోవాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/