మహేశ్వరంలో మలబార్‌ జెమ్స్, జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్‌ కు కేటీఆర్ శంకుస్థాపన

తెలంగాణ లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు మలబార్‌ ముందుకు వచ్చింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని మహేశ్వరంలో శనివారం మలబార్‌ జెమ్స్, జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసారు. ఈ కంపెనీ ద్వారా రూ. 750 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 2,750 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది.

ఇప్పటికే రాష్ట్రంలో 17 రిటైల్ షోరూమ్స్‌ను ప్రారంభించి , వెయ్యి మందికి పైగా ఉపాధి అవకాశాలను కల్పించింది. ఇక మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, పరిశ్రమల డైరెక్టర్ డీ కృష్ణ భాస్కర్, మలబార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అహ్మద్ ఎంపీ, వైస్ చైర్మన్ అబ్దుల్ సలాం కేపీ పాల్గొన్నారు.