ఈ సారి గుండెపోటు తల్లికో.. చెల్లికో..? – జగన్ ఫై లోకేష్ చురకలు

పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన వలంటీర్ల సత్కార సభలో జగన్ ఓ రేంజ్ లో చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ఫై విరుచుకపడ్డారు. డిపాజిట్లు దక్కవనే భయం ఎల్లో పార్టీ, దాని అధినేత చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోందని, అనుబంధంగా ఉన్న పార్టీలోనూ ఆ బాధ కనిపిస్తోందని, ఢిల్లీ పర్యటనలో మోదీగారు జగన్‌కు క్లాస్‌ పీకారంటూ టీడీపీ ప్రచారం చేస్తుందని..భవిష్యత్‌లో ఎవరూ ఓటు వేయరన్న భయమే వాళ్లతో అలాంటి పనులు చేయిస్తోందని అన్నారు.

అసూయ కు మందు లేదని.. ఇంత అసూయతో ఉంటే త్వరగా గుండెపోటు, బీపీ లు వస్తాయని త్వరగా టికెట్ తీసుకొనిపోతారని, ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోని దుర్మార్గులు ఇప్పుడు.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్న ప్రభుత్వాన్ని విమర్శించడం చోద్యంగా ఉందన్నారు. ఈ మాటలకు నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా చురకలు అంటించారు. అసూయ కి అన్న లాంటి వాడు సిఎం జగన్ మోహన్ రెడ్డి అని.. అందుకే నాన్న, బాబాయ్ కి టికెట్ తీసి పంపేసాడు. మరోసారి ఆయన అసూయతో గర్వం దాల్చాడు. ఈ సారి గుండెపోటు తల్లికో! చెల్లికో? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్. అంతే కాదు వలంటీర్ల సత్కార సభలో జగన్ మాట్లాడిన వీడియో ను షేర్ చేసాడు లోకేష్.

అసూయ కి అన్న లాంటి వాడు @ysjagan.
అందుకే నాన్న, బాబాయ్ కి టికెట్ తీసి పంపేసాడు. మరోసారి ఆయన అసూయతో గర్వం దాల్చాడు. ఈ సారి గుండెపోటు తల్లికో! చెల్లికో? pic.twitter.com/VaLqzPlqGV— Lokesh Nara (@naralokesh) April 7, 2022