నేడు కొరిశపాడు-రేణింగవరం మధ్య ట్రయల్ రన్‌

హైవేలపై ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ ట్రయల్ రన్ ఈరోజు ఏపీలో నిర్వహించనున్నారు.. కొరిశపాడు – రేణింగవరం మధ్య జాతీయ రహదారిపై ఈ హైవే రన్‌వేపై విమానాల ల్యాండింగ్‌కు ఎయిర్ ఫోర్స్, హైవే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.. అత్యవసర పరిస్థితుల్లో విమానాలను దించే విధంగా.. దేశవ్యాప్తంగా 13 రన్‌వేలను జాతీయ రహదారులను సిద్ధం చేస్తున్నారు.

హైవే అథారిటీ 79 కోట్ల రూపాయలతో 4.1 కిలోమీటర్ల పొడవైన రహదారిని ప్రత్యేకంగా నిర్మించింది.. ఈ రోజు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట మధ్య హైవేపై విమానాలు దిగనున్నాయి.. ఇక, ఈ సందర్భంగా హైవే పై వెళ్లే వాహనాలను ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు దారి మళ్లించి.. ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పోలీసులు.