పార్లమెంటును స్తంభింపజేయడాన్ని వైఎస్‌ఆర్‌సిపి సమర్థించదుః విజయసాయిరెడ్డి

మణిపూర్ అంశం దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన విషయమని వ్యాఖ్య

ysrcp-is-against-to-blocking-of-parliament-says-vijayasai-reddy

న్యూఢిల్లీః మణిపూర్ అంశంపై పార్లమెంటు అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మరోవైపు వైఎస్‌ఆర్‌సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటును స్తంభింపజేయడాన్ని వైఎస్‌ఆర్‌సిపి సమర్థించదని చెప్పారు. మణిపూర్ అంశంపై చర్చకు సిద్ధమని, తాము సమాధానం చెపుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారని తెలిపారు. ఇలాంటప్పుడు ఉభయ సభలు కొనసాగకుండా అడ్డుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. మణిపూర్ అంశం దేశ అంతర్గత భద్రతకు చెందిన అంశమని… ఇది పూర్తిగా కేంద్ర హోం శాఖ పరిధిలో ఉంటుందని చెప్పారు.