ఏప్రిల్ 12 న ఆచార్య ట్రైలర్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్స్టార్ రామ్చరణ్ హీరోలుగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య’. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 29 న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భాంగా ప్రమోషన్ ఫై మేకర్స్ దృష్టి సారించారు. ఈ నెల 12 చిత్ర ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసారు.
ఇప్పటికే విడుదలైన ‘ఆచార్య’ ప్రచార చిత్రాలు – గ్లిమ్స్ – టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. అలానే ‘లాహే లాహే’ ‘నీలాంబరి’ ‘సానా కష్టం’ సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. అయితే చాలా రోజులుగా ఈ సినిమా నుంచి సరైన అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు.
రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ప్రమోషన్స్ చేయడం లేదంటూ ‘ఆచార్య’ నిర్మాతలను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. రెగ్యులర్ గా అప్డేట్స్ ఇవ్వకపోవడం వల్ల జనాల్లో ఇంట్రెస్ట్ తగ్గిపోతుందని.. అసలు అనుకున్న సమయానికి సినిమా విడుదలవుతుందా లేదా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే అభిమానుల మొర ఆలకించిన ”ఆచార్య” మేకర్స్.. తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించి వారిని శాంతింపచేసారు.
ఇక ఈ మూవీలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా.. చరణ్ కు జోడీగా పూజా హెగ్డే కనిపించనుంది. రెజీనా కాసాండ్రా – సంగీత ప్రత్యేక గీతాల్లో నటించగా.. సోనూసూద్ – జిషు సేన్ గుప్తా – వెన్నెల కిశోర్ – పోసాని కృష్ణ మురళి – తనికెళ్ళ భరణి – సౌరవ్ లోకేష్ – అజయ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.