రేపు ప్రధానిని కలవనున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

komatireddy-venkat-reddy-will-meet-prime-minister-modi-tomorrow

హైదరాబాద్‌ః గత కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ లీడర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రేపు (శుక్రవారం) ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. అతని సోదరుడు, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుతో.. ఇప్పుడు వెంకట్ రెడ్డి కూడా పార్టీ మారనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీతో భేటీ అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అభివృద్ధి పనులకు సంబంధించి ప్రధాని అపాయింట్మెంట్ కోరిన ఎంపీ.. మూసీ ప్రక్షాళన, నేషనల్ హైవే ఇష్యూస్ కి సంబంధించి ప్రధానమంత్రి తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముసలం రోజు రోజుకూ ముదురుతోంది. గతంలోనే వర్గాలుగా విడిపోయి.. అంతర్గత పోరుకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన కాంగ్రెస్.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ కు వేదికగా మారింది.

మరోవైపు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని ఖర్గేకు వివరించారు. ఇటీవల ప్రకటించిన పీసీసీ కమిటీల్లో పలువురు సీనియర్ల పేర్లు లేకపోవడాన్ని ఖర్గే వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానం అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటుందని ఈ సందర్భంగా కోమటిరెడ్డితో ఖర్గే చెప్పినట్టు తెలుస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/