వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న కోహ్లీ
ఇన్స్టాగ్రామ్లో ఫొటో షేర్

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడు. వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. అందరూ జాగ్రత్తగా ఉండాలని, సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించాడు.అటు సీనియర్ పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ కూడా తన భార్య ప్రతిమా సింగ్తో కలిసి వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఇప్పటికే శిఖర్ ధావన్, రహానే, ఉమేష్ యాదవ్లాంటి వాళ్లు కరోనా వ్యాక్సిన్లు తీసుకున్నారు.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/