సర్వేల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు – కిషన్ రెడ్డి

తెలంగాణ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొన్ని సంస్థలు సర్వేల పేరుతో తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు కేంద్ర మంత్రి , రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి. ఎన్నికలకు ముందే కొన్ని సర్వే సంస్థలు రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. సర్వేల పేరుతో ప్రజాభిప్రాయాలను తప్పుదోవపట్టించడం మంచిది కాదని హెచ్చరించారు. బిజెపి ప్రచారం లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.

ఈ నెల 11వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారని కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల చివరి నాటికి మరో రెండు మూడు సభలలో పాల్గొంటారని చెప్పారు. కేంద్రమంత్రి అమిత్ షా కూడా పలుచోట్ల రోడ్డు షోలో పాల్గొంటారని తెలిపారు. మరో నాలుగైదు స్థానాలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు రోడ్డు షోలో పాల్గొంటారన్నారు.