ఎన్‌కౌంటర్ లో నలుగురు మావోల మృతి

ఒక ఎస్సై మృతి ..కొనసాగుతున్న కూంబింగ్

Encounter
Encounter

ఛత్తీస్‌గఢ్‌: చత్తీస్‌గఢ్‌ మాన్పూర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని పర్ధోని గ్రామ సమీపంలో నిన్న రాత్రి జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈఎన్‌కౌంటర్‌లో ఎస్సై సహా నలుగురు మావోయిస్టులు స్థలంలోనే మృతి చెందారు. కాల్పుల అనంతరం ఘటనా స్థలం నుంచి ఏకే 47 రైఫిల్, రెండు 315 బోర్ రైఫిళ్లు, ఒక ఎస్ఎల్ఆర్‌ను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతున్నట్టు రాజ్‌నందగాన్ ఏఎస్పీ జీఎన్ బాఘెల్ తెలిపారు. కాగా తమకు తారసపడిన పోలీసులపై మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/