ఏపీ రాజధాని విషయంలో కిషన్ రెడ్డి క్లారిటీ

ఏపీలో ప్రస్తుతం రాజధాని అంశం రోజు రోజుకు వేడెక్కుతుంది. మూడు రాజధానులు వైస్సార్సీపీ ముగ్గు చూపిస్తుంటే..టీడీపీ తో పాటు బిజెపి , జనసేన , అమరావతి రైతులు అమరావతినే రాజధానిగా ఉంచాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజధాని అంశం ఫై స్పందించారు. ఏపీకి ఏకైక రాజధాని అమరావతే అని స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కిషన్ రెడ్డికి బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. రాజధానుల వివాదంపై స్పందించిన కేంద్ర మంత్రి.. ఏపీకి ఏకైక రాజధాని అమరావతే అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారని గుర్తుచేశారు. కిషన్ రెడ్డి ఏలూరు, గుంటూరు జిల్లాల్లో కేంద్రమంత్రి పర్యటించనున్నారు. ఏపీకి మూడు రాజధానులు కాదని, కేవలం ఒక్క రాజధాని అమరావతి మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు.

ఏపీలో రాజధానుల వివాదం, జనసేన అధినేతను విశాఖలో హోటల్ కు పరిమితం చేయడం, జనసేన నేతల్ని పోలీసులు అరెస్ట్ చేయడంపై కిషన్ రెడ్డి స్పందించారు. రాజకీయాల్లో ఎక్కడైనా కక్ష సాధింపు చర్యలు అనేది కరెక్ట్ కాదని అన్నారు. మొదట్నుంచీ తమ పార్టీ అదే చెబుతోందని తెలిపారు. ధర్నా చేసిన రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి వారికి న్యాయం చేసిందని గుర్తుచేశారు.