హైకోర్టులో టీఆర్ఎస్ లంచ్ మోషన్ పిటిషన్

మునుగోడు ఉప ఎన్నికలో కారు ను పోలిన ఎనిమిది గుర్తులను తొలగించాలని టిఆర్ఎస్ హైకోర్టు ను కోరింది. కెమెరా, చపాతీ రోలర్, డోలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడ గుర్తు కేటాయించవద్దని విజ్ఞప్తి చేసింది. మునుగోడు ఉప ఎన్నిక ఫై దేశ వ్యాప్తంగా చర్చ గా మారింది. ఈ ఉప ఎన్నిక ను అన్ని పార్టీ లు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రస్తుతం నామినేషన్ల పర్వం ముగిసింది. దీంతో నేతలంతా ప్రచారంలో బిజీ గా ఉన్నారు. ఇదిలా ఉంటె అధికార పార్టీ టిఆర్ఎస్ కు ఇతర గుర్తులు తలనొప్పిగా మారాయి. కారు గుర్తును పోలిన ఎనిమిది గుర్తులు ఉండడంతో కారు కు వేయాల్సిన వారు వాటికీ వేసే అవకాశం ఉంది.

దీంతో టిఆర్ఎస్ ఆ గుర్తులను తొలగించాలని హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది. భోజన విరామంలో అత్యవసర విచారణ జరపాలని విజ్ఞప్తి చేయగా ధర్మాసనం నిరాకరించింది. నవంబరు 3న పోలింగ్ ఉన్నా ఈసీ నిర్ణయం తీసుకోవడం లేదని టీఆర్ఎస్ హైకోర్టుకు తెలిపింది. దీనిని మధ్యాహ్నం పరిశీలించలేమని.. రేపు విచారణ జరుపుతామని సీజే ధర్మాసనం పేర్కొంది.

గతంలో 2018 ఎన్నికల్లో కారును పోలిన గుర్తుల వల్ల తమ అభ్యర్థులకు నష్టం జరిగిందని టీఆర్ఎస్ చెబుతోంది. పలు నియోజకవర్గాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థుల కన్నా.. ఈ గుర్తులతో బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు వచ్చాయని టీఆర్ఎస్ పార్టీ కోర్టుకు విన్నవించింది