బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అరెస్ట్

ఇందిరాపార్క్ వద్ద 24 గంటల నిరాహార దీక్ష చేస్తోన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకే బీజేపీ దీక్షకు అనుమతి ఉందని.. దీంతో దీక్షను విరమించుకోవాలని పోలీసులు కిషన్ రెడ్డిని కోరారు. కానీ రేపటి వరకు దీక్ష చేస్తామని పోలీసులకు కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. దీక్ష కొనసాగిస్తానని భగ్నం చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

అయినప్పటికీ అనుమతి ఇచ్చిన సమయం అయిపోయిందని పోలీసులు కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇందిరా పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అంతకుముందు, కిషన్ రెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా తన దీక్ష కొనసాగుతుందన్నారు. శాంతియుత దీక్ష వల్ల పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు.