ఈ నెల 16న పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్
ఈ నెల 16న పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ను సీఎం కేసీఆర్ నిర్వహించనున్నారు. నార్లాపూర్ ఇన్టేక్ వద్ద స్విచ్ఛాన్ చేసి సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. వెట్రన్లో భాగంగా రెండుకిలోమీటర్ల దూరంలో ఉన్న నార్లాపూర్ రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోయనున్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కృష్ణానదికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వెట్రన్ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనుండగా.. సీఎం కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అలాగే పాలమూరు-రంగారెడ్డి జిల్లాల్లోని పల్లెపల్లె నుంచి ప్రజలు, గ్రామ సర్పంచులు హాజరుకానున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అడ్డంకులు తొలిగి కొలిక్కి వచ్చినందుకు గ్రామాల్లోని దేవాలయాల్లో స్వామివారి పాదాలను పాలమూరు జలాలతో అభిషేకం చేసి మన మొక్కులు చెల్లించుకుందామంటూ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ నెల 17న ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రతి గ్రామంలో దేవుళ్ల పాదాలకు అభిషేకం చేయాలన్నారు.