బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి
రాబోయే ఎన్నికల్లో ములుగు లో బిఆర్ఎస్ పార్టీ ఎగురవేయాలని సీఎం కేసీఆర్ పక్క ప్రణాళికతో ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క ఫై బడే నాగజ్యోతిని నిలబెట్టారు. ఈమె గెలుపు కోసం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జిగా వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డిని నియమించారు.
ఈ సందర్బంగా తనను ఇన్చార్జిగా నియమించిన సీఎం కేసీఆర్కు, మంత్రి కేటీఆర్కు పోచంపల్లి కృతజ్ఞతలు తెలిపారు. 2018 ఎన్నికల్లో ములుగు బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయినా ప్రజలకు ఇచ్చిన మాట కోసం ములుగును జిల్లాగా ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని పోచంపల్లి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతిని గెలిపించడం ద్వారా ఆయన రుణాన్ని తీర్చుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.