నేడు చంద్రబాబు పిటిషన్లపై తీర్పు వెలువరించనున్న ఏసీబీ కోర్టు

ACB court will pronounce judgment on Chandrababu’s petitions today

అమరావతి: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు కస్టడీ, బెయిల్‌ పిటిషన్లపై ఏసీబీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించనున్నది. సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్‌ పిటిషన్‌ కూడా అదేరోజు విచారణకు రానున్నది. ఇదిలా ఉండగా పక్కా ప్లాన్‌తో చంద్రబాబు మాజీ పీఎస్‌ పెండ్యాల శ్రీనివాసరావు చౌదరి పరారీలో ఉన్నట్టు సీఐడీ పేర్కొన్నది. ప్రస్తుతం శ్రీనివాసరావు ప్రణాళికాశాఖలో అసిస్టెంట్‌ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సీఐడీ గతంలోనే ఆయనకు నోటీసులు జారీ చేసింది. అయితే, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా అమెరికాకు పారిపోయాడని సీఐడీ పేర్కొన్నది. శుక్రవారంలోగా రాష్ర్టానికి తిరిగి రావాలంటూ ప్రభుత్వం ఈ-మెయిల్‌ ద్వారా నోటీసులు పంపింది. ఇన్‌కంటాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ కూడా పెండ్యాలకు నోటీసులు జారీ చేసింది.