హైదరాబాద్లో డ్రగ్స్ మరోసారి కలకలం
హైదరాబాద్ మహా నగరంలో మరోసారి డ్రగ్స్ భారీగా పట్టుబడ్డాయి. ఆదివారం (నిన్న) సైబరాబాద్ పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహించిన డ్రగ్స్ ముఠా పోలీసులకు పట్టుబడింది. గోవా నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకొచ్చిన 32 గ్రాముల కొకైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా, గ్రాము కొకైన్ ను రూ.30 వేలకు అమ్ముతున్నారు.
రాజమండ్రికి చెందిన విక్కీ, గోపి షెట్టి, రాజేష్, నరేష్ల అనే నింధితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా నుంచి కొకైన్ తెచ్చి హైదరాబాద్లో విక్రయం చేస్తున్నట్లు గుర్తించారు. సంపన్నులే టార్గెట్ చేసి డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నారని తెలిపారు. విక్కీని పట్టుకోవడానికి గత సంవత్సరం నుంచి ఎస్ఓటీ పోలీసులు వల వేశారు. స్పెషల్ ఆపరేషన్ టీమ్ కళ్లు కప్పి విక్కీ డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నాడు. విక్కీ గ్యాంగ్ను ఎట్టకేలకు పట్టుకున్న ఎస్ఓటీ తెలిపారు. నలుగురుపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.