దాబాలో చాయ్ తాగిన సీఎం కేసీఆర్..
సిద్దిపేటలో బహిరంగ సభ ముగించుకుని, హైదరాబాద్కు తిరుగు ప్రయాణమైన సీఎం కేసీఆర్.. సిద్దిపేట పట్టణ శివారులో ఓ దాబాలో చాయ్ తాగారు. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ దూసుకుపోతోంది. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తునే.. ప్రజలకు హామీలను గుప్పిస్తున్నారు గులాబీ బాస్. వరుసగా మూడో రోజు సీఎం కేసీఆర్ రెండు భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. నిన్న సిద్దిపేటతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకొని భావోద్వేగానికి గురయ్యారు.
శనివారం రాత్రి సిద్దిపేటలో బహిరంగ సభ ముగించుకుని, హైదరాబాద్కు తిరుగు ప్రయాణమైన సీఎం కేసీఆర్.. సిద్దిపేట పట్టణ శివారులో కాసేపు ఆగారు. శివారులో ఉన్న పొన్నాల సోని దాబాలో కేసీఆర్ కాసేపు సేద తీరారు. దాబాలో కేసీఆర్ చాయ్ తాగారు. సీఎంతో పాటు మంత్రి హరీశ్రావు, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, దామోదర్ రావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, సిద్దిపేట నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలతో పాటు ప్రస్తుత పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.