ధర్మపురి అర్వింద్పై ఎమ్మెల్సీ కవిత ఫైర్..
తెలంగాణ లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార , ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు , ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు.
అర్వింద్ అసభ్యకరంగా అవమానకరంగా.. మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. తన అన్న చనిపోతే 10 లక్షలు, తన తండ్రి చనిపోతే 15 లక్షల రూపాయలు ఇస్తానని అర్వింద్ ప్రకటన చేయడమేంటని మండిపడ్డారు. రాజకీయాల్లో ఇంత దిగజారి మాట్లాడటమేంటని దుయ్యబట్టారు. ఇలాంటి మాటలు.. ఇలాంటి రాజకీయాలు అవసరమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.