బిజెపికి గుడ్ బై చెప్పిన నటి కరాటే కళ్యాణి

నటి కరాటే కళ్యాణి బిజెపి పార్టీ కి గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం తెలంగాణ లో బిజెపి పార్టీ లో ఏంజరుగుతుందో అర్ధం కావడం లేదు. ఏ నేత ఎప్పుడు పార్టీ మారతారో తెలియడం లేదు. సొంత నేతలపైనే విమర్శలు చేసుకుంటున్నారు. రీసెంట్ గా పార్టీ అధ్యక్ష పదవి నుండి బండి సంజయ్ ని తప్పించి కిషన్ రెడ్డి కి అప్పగించడం, ఈటెల రాజేందర్ కు కీలక పదవి ఇవ్వడం ఫై పలువురు బిజెపి నేతలు అసంతృప్తి ఉన్నారు. ఇలా పార్టీ లో గందరగోళం నెలకొని ఉండడం..చాలామంది పార్టీ నుండి బయటకు వచ్చేందుకు చూస్తున్నారు.

తాజాగా నటి కరాటే కళ్యాణి పార్టీ కి గుడ్ బై చెప్పింది. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కరాటే కళ్యాణి… నటిగా కంటే ఎప్పుడు వివాదాల్లోనే ఎక్కువగా నిలుస్తూ ఉంటుంది. తరచూ తనకు సంబంధంలేని వివాదాలలో తలదూరుస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఇదే క్రమంలో బిజెపి పార్టీ లో చురుగ్గా ఉంటూ వస్తున్న ఈమె..తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో బిజెపి కి గుడ్ బై చెపుతున్నట్లు తెలిపింది. చాలా రోజులుగా పార్టీ లో జరుగుతున్న సంఘటనలు చూస్తున్నా నాకు అవి నచ్చడం లేదు, పార్టీ మారితే బెస్ట్ అనిపిస్తుంది..కానీ మోడీ గారికీ సపోర్ట్ చేస్తా, మారే పార్టీని బట్టి…పూర్తిగా నా నిర్ణయం ఉంటుంది… పిచ్చి కామెంట్స్ పెట్టకండి అంటూ పోస్ట్‌ పెట్టింది.