టీడీపీ పార్టీ కండువా కప్పుకున్న కన్నా లక్ష్మీనారాయణ

బిజెపి మాజీ నేత, కన్నా లక్ష్మీనారాయణ గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ లో చేరారు. ఈ సందర్భాంగా కన్నా కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు. కన్నాతో పాటు ఆయన కుమారుడు, గుంటూరు మాజీ మేయర్ నాగరాజు కూడా టీడీపీలో చేరారు.

వీరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులు 3 వేల మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. అంతకు ముందు గుంటూరులోని తన నివాసం నుంచి కన్నా లక్ష్మీనారాయణ భారీ వాహన ర్యాలీతో పార్టీ ఆఫీసుకు వచ్చారు. గత కొంతకాలంగా బిజెపి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న కన్నా..రీసెంట్ గా బిజెపి పార్టీ కి రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారు. తాను పార్టీలో ఇమడలేకపోతున్నాని, అందుకే రాజీనామా చేస్తున్నాని ప్రకటించారు.