మరో భారతీయుడికి కొవిడ్‌-19

జపాన్ విహారనౌకలో వైరస్ లక్షణాలు గుర్తింపు

diamond-princess
diamond-princess

జపాన్‌: కొవిడ్‌-19 వైరస్‌ చైనాతో పాటు ఇతర దేశాలపై పంజా విసురుతుంది. ఈనేపథ్యంలో మూడు వేల మంది ప్రయాణికులతో యోకహామా రేవులో నిలిచిపోయిన జపాన్ విహారనౌక డైమండ్ ప్రిన్సెస్ లో కూడా కరోనా ఛాయలు కనిపిస్తున్నాయి. ఈ నౌకలోని ప్రయాణికుల్లో 285 మందిలో కొవిడ్‌-19 వైరస్ లక్షణాలను గుర్తించారు. ఇప్పటికే ఈ నౌకలోని ఇద్దరు భారతీయులకు కూడా కొవిడ్‌-19 సోకగా, తాజాగా మరో భారత జాతీయుడు కూడా ఈ మహమ్మారి బారినపడ్డాడు. డైమండ్ ప్రిన్సెస్ నౌకలో కరోనా ప్రభావిత ప్రయాణికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ముగ్గురు భారతీయుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని జపాన్ లోని భారత రాయబార వర్గాలు వెల్లడించాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/