KA పాల్ కొత్త అవతారం..

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన బయటకు వస్తే ఓ సన్షేషనల్ ..ఆయన ఏం మాట్లాడిన కామెడీ..ఏం చేసిన కొత్తదనమే. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఎక్కడ జరిగిన అక్కడ పోటీ చేయడం ఈయన ప్రత్యేకం. తెలంగాణ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ తరపునే కాకుండా తనుకూడా పోటీ చేసి వార్తల్లో నిలిచారు. ఇక ఇప్పుడు వైజాగ్ నుండి బరిలోకి దిగుతున్నాడు. ఈ క్రమంలో తనదైన ప్రచారంతో వార్తల్లో నిలుస్తున్నాడు.

తాజాగా జాలరిగా మరి ఆకట్టుకున్నాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..విశాఖలోని మత్య్సకారుల ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆయన మత్య్సకారులతో కలిసిపోయి చేపలు పట్టేశారు. వాళ్ల సమస్యలు తనకు పూర్తిగా తెలుసున్న ఆయన.. మినీ హార్బర్ కట్టాలని ఎప్పటినుంచో వాళ్లు కోరుతున్నారని అన్నారు. ఈసారి ఎన్నికల్లో తాను గెలిస్తే కచ్చితంగా మినీ హార్బర్ కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటానని చెప్పుకొచ్చారు. విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న కుండ గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని మత్య్సకారులను కోరారు.