ఒంగోలు లో జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది వైస్సార్సీపీ వాళ్లేనట

ఒంగోలు ప్రధాన కూడలిలో నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్.. ‘అసలోడు వచ్చే వరకూ కొసరోడికి పండగే’ అంటూ ఫ్లెక్సీలు చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే.. ఓ పక్క ఒంగోలు లో నారా లోకేష్ యువగళం యాత్ర కొనసాగుతుండగా..ఈ ప్లెక్సీ లు ఎవరు ఏర్పటు చేసారా అని టీడీపీ వర్గీయులు ఆరా తీస్తుండగా..ఈ ప్లెక్సీ లు ఏర్పటు చేసింది మా పార్టీ వారే అంటూ వైస్సార్సీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు చెప్పుకొచ్చారు.

తమ పార్టీ నేతలే ఒంగోలులో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఫ్లెక్సీలు వేశారని.. తమ పార్టీ వారికి ఏ పని సరిగా చేయడం రాదంటూ వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు వేస్తే అందులో హరికృష్ణ ఫోటో ఉండేదన్నారు. లోకేష్ మీటింగ్ ప్రకాశంలో ఉంటే అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు వైసీపీ వాళ్లే పెట్టారని తెలిపారు. లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోందన్నారు. అమ్మఒడి సగం మంది పిల్లలకు ఇంకా రాలేదని.. పిల్లలు మామయ్య నొక్కేసిన డబ్బులు ఇంకా రాలేదు అని అంటున్నారని ఎద్దేవా చేశారు.