వైస్సార్సీపీ నేతలు ENO, Burnol వాడుకోండి అంటూ జనసేన నేతల కౌంటర్

ఏపీలో రాబోయే ఎన్నికల్లో వైస్సార్సీపీ పార్టీ ని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు టిడిపి , జనసేన. అందుకోసం ఇద్దరు కలిసి బరిలో దిగబోతున్నట్లు గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం చంద్రబాబు ఇంటికి వెళ్లి దాదాపు రెండు గంటల పాటు సమావేశమయ్యారు. వివిధ అంశాల ఫై ఇరువురు మాట్లాడుకున్నారు. వీరిద్దరి సమావేశం అనంతరం వైస్సార్సీపీ నేతలు వరుస పెట్టి వీరిపై మాటల యుద్ధం చేస్తున్నారు. వారికీ తగ్గట్లే జనసేన నేతలు సైతం ఎదురుదాడికి దిగారు.

తాజాగా మనుక్రాంత్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. చంద్రబాబు – పవన్ కళ్యాణ్ భేటీ అనంతరం వైస్సార్సీపీ నేతలకు పొట్టలో మంటగా ఉంటె ENO వాడాలని.. ఇంకెక్కడైనా కాలుతుంటే Burnol వాడండి అంటూ వాటిని ప్రెస్‌మీట్‌కు తీసుకొచ్చి ప్రదర్శించారు. మంత్రులు ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోవాలని.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ అనంతరం రాష్ట్రంలో ENO, Burnol సేల్స్ బాగా పెరిగాయి అంట అని ఎద్దేవా చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ తర్వాత భయాందోళన మొదలైంది అన్నారు మనుక్రాంత్. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. వారిని సమస్యలు తీర్చాలని ప్రజలు గెలిపించారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రజల కష్టాలు గాలికి వదిలేసి ప్రతిపక్షాలను నోటికొచ్చినట్లు తిడుతున్నారని.. పవన్‌ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.