పార్టీ మారడం ఫై వైస్సార్సీపీ ఎమ్మెల్యే వసంత క్లారిటీ

ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే ఎన్నికల హోరు మొదలైంది. పలు పార్టీల నేతలు తమకు అనుకూలమైన పార్టీ ఏది అనేది ఇప్పటి నుండే చూసుకుంటున్నారు. గత ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున అధికార పార్టీలోకి వెళ్లిన చాలామంది నేతలు..ఇప్పుడు ఆ పార్టీ నుండి బయటకు వచ్చేందుకు సిద్దమవుతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పలువురు పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. వారిలో వైస్సార్సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా పార్టీ మారబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతుండడం తో వాటిపై క్లారిటీ ఇచ్చారు.

రాజకీయాల్లో ఉన్నంత వరకు తాను వైస్సార్సీపీ జెండానే పెట్టుకుంటానని , పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. యదార్ధ వాది లోక విరోధి.. నేను వాస్తవాలు మాట్లాడుతోన్న.. వాటిని సంచలనాలు అంటున్నారని.. రాజకీయాల్లోకి వచ్చాక చేయాల్సినవి చేయలేకపోయాననే అసంతృప్తి ఉందని తెలిపారు. పార్టీలో కొందరు సొంత ఇమేజ్ కోసం ప్రయత్నిస్తారు.. నాకు అది ఇష్టం లేదని వెల్లడించారు. ఇప్పుడు కాంగ్రెస్ తరహా రాజకీయాలు చేయలేం.. ప్రాంతీయ పార్టీల కాలం నడుస్తోందన్నారు. పొరంబోకులు పక్కన లేకుంటే రాజకీయాలు చేయలేం.. ఇది వాస్తవం అన్నారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు వైస్సార్సీపీ లోనే ఉంటానని స్పష్టం చేశారు.