రూపే కార్డులకు మాత్రమే ప్రాధాన్యత

బ్యాంకర్లకు నిర్మలా సీతారామన్‌ సూచన

Nirmala Sitharaman
Nirmala Sitharaman

ఖాతాదారులకు కార్డులు జారీ లో రూపే కార్డులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని బ్యాంకర్లకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు.

ఈ ఏడాది డిసెంబర్‌ 31 నాటికి బ్యాంక్‌ ఖాతాలన్నింటిని ఆధార్‌తో అనుసంధానం చేయాలని, అవస రమైనప్పుడు పాన్‌కార్డులతో కూడా లింక్‌ పూర్తి చేయాలని కోరారు.

ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియే షన్‌(ఐబీఏ) 73వ వార్షిక సాధారణ సమావేశంలొ ఆమె పాల్గొన్నారు. ఎన్‌పీ సీఎల్‌ (నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) భారత బ్రాండ్‌ ప్రొడక్ట్‌గా మారే అవకాశాలున్నాయి.

ఎన్‌పీసీఐ నిర్వహించే రూపే కార్డులనే ఇవ్వాలని ఆమె సూచించారు. భార తీయ బ్యాంకులు అద్భుతంగా పనిచేశాయి.

వ్యవస్థలో ధృవీకరిం చని బ్యాంక్‌ ఖాతా ఉండకూడదని ఆదేశించారు. బ్యాంకింగ్‌లో యూపీఐ చెల్లింపులు సహజంగా మారిపోవాలని కృషి చేయాలని బ్యాంకర్లకు ఆమె సూచించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/