రేపు సీఎం జగన్‌ అనంతపురం జిల్లా పర్యటన రద్దు

రేపు సీఎం జగన్‌ అనంతపురం జిల్లా పర్యటన రద్దయ్యింది. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పల లో జగనన్న వసతి దీవెన కార్యక్రమం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయాలనీ అనుకున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా అధికారులు , నేతలు పూర్తి చేసారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నార్పల మండల కేంద్రంలో రేపు జరగబోయే జగనన్న వసతి దీవెన కార్యక్రమం వాయిదా పడినట్లు జిల్లా కలెక్టర్‌ఎమ్‌.గౌతమి ఒక ప్రకటనలో తెలిపారు.

ఇదిలా ఉండగా.. రేపు సాయంత్రం సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడలో పర్యటించనున్నారు. వన్‌ టౌన్‌ విద్యాధరపురంలోని మినీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.