జగన్ విశాఖ పర్యటన వాయిదా
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 13 న విశాఖ పర్యటన చేయాల్సి ఉండగా..భారీ వర్షాల కారణంగా వాయిదా వేసుకున్నారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అందిస్తున్న వాహన మిత్ర నిధులను విడుదల చేసే నిమిత్తం ఈ నెల 13న విశాఖ పర్యటనను జగన్ ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో వాహన మిత్ర నిధులను జగన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలనీ అనుకున్నారు.
కానీ రెండు రోజులుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనను ఈ నెల 15కు వాయిదా వేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం సోమవారం సాయంత్రం ప్రకటించింది. ఈ టూర్ షెడ్యూల్ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.