ద్రౌపది ముర్ము తెలంగాణ పర్యటన రద్దు
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ..హైదరాబాద్ పర్యటన రద్దు అయ్యింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ద్రౌపది ముర్ము.. రేపు(మంగళవారం) హైదరాబాద్లో పర్యటించాల్సి ఉంది. అయితే, అనివార్య కారణాల వల్ల ఆమె.. తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నట్టు సమాచారం. దేశంలోనే అత్యున్నత పదవి అయిన భారత రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి.
ఇప్పటికే ద్రౌపది ముర్ము ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో వెళ్లి.. ఎన్డీఏ ఎమ్మెల్యేలను కలుసుకొని తనకు ఓటేయాల్సిందిగా అభ్యర్థించారు. శనివారం నాడు వెస్ట్ బెంగాల్ వెళ్లిన ఆమె.. కోల్ కతాలోని ఓ హోటల్ లో బీజేపీ ఎమ్మెల్యేలను కలవడం జరిగింది. ఇదిలా ఉంటె టీడీపీ సైతం ద్రౌపది ముర్ము కు మద్దతు ప్రకటించడం జరిగింది.
ఒడిశా రాష్ట్రానికి చెందిన 64 ఏళ్ల ద్రౌపది ముర్ము.. ఆదివాసీ (ఎస్టీ) సామాజికవర్గానికి చెందిన వారు. ద్రౌపది ముర్ము ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా బైడపోసిలో జన్మించారు. ఝార్ఖండ్ గవర్నర్గా పనిచేశారు. ద్రౌపది ముర్ము భర్త పేరు శ్యామ్చరణ్ ముర్ము. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఉపాధ్యాయురాలిగా జీవితం ప్రారంభించిన ద్రౌపది ముర్ము.. అనంతరం రాజకీయాల్లో ప్రవేశించారు. వివాదాలు లేని వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2015-2021 వరకు జార్ఖండ్ గవర్నర్గా పని చేశారు. జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్ అయిన ముర్ము 2000-04 మధ్యలో ఒడిశా రవాణా, ఫిషరీస్ శాఖల మంత్రిగా పని చేశారు.