పార్టీ నేతలను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్న జగన్
![](https://www.vaartha.com/wp-content/uploads/2023/12/jagan-tirupathi-jpg.webp)
అమరావతిః ఏపీ సిఎం జగన్ అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతోంది. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహాలపై 175 నియోజకవర్గాలకు చెందిన నేతలకు జగన్ మార్గనిర్దేశం చేస్తున్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో ‘మేము సిద్ధం.. మా బూత్ సిద్ధం’ పేరుతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశం ద్వారా పార్టీ నేతలను ఎన్నికలకు జగన్ సమాయత్తం చేస్తున్నారు.
ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, రీజనర్ కోఆర్డినేటర్లు, నియోజకవర్గ పరిశీలకులు, మండల పార్టీ అధ్యక్షులు, జగనన్న సచివాలయ కన్వీనర్లు హాజరయ్యారు. వచ్చే నెల 3వ తేదీన పల్నాడులోని పిచ్చికలపాడులో ‘సిద్ధం’ చివరి సభను నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారానికి జగన్ శ్రీకారం చుడతారు. ఇప్పటి వరకు భీమిలి, దెందులూరు, రాప్తాడులలో మూడు ‘సిద్ధం’ సభలను నిర్వహించారు.