విశాఖలో వైఎస్సార్‌సీపీ నేతపై దాడి

వైసీపీ పార్టీ కి చెందిన వ్యక్తి ఫై ఆగంతకుడు దాడి చేసిన ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. వైసీపీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు..శుక్రవారం సాయంత్రం గవరపేటలో ఉన్న తన ఇంటి నుంచి గెస్ట్ హౌస్ కు వెళ్తుండగా.. శారదానది వంతెన దగ్గర గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై కత్తితో దాడి చేశాడు. మెడపై కత్తితో నరకడానికి ప్రయత్నించగా బుల్లిబాబు తన చేతులతో అడ్డుకున్నారు. ఆ దెబ్బకు చేతి వేళ్లు రెండు తెగిపడ్డాయి. మరో రెండు వేళ్లకు తీవ్రగాయమైంది. తలపైన కూడా బలమైన గాయం తగిలింది.

బుల్లిబాబు పెద్దగా కేకలు వేయడంతో దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు ఆయన్న వెంటనే ఆస్పత్రికి తరలించారు.మల్లిబాబు దాడి సమయంలో చేతిని అడ్డుపెట్టకపోతే మెడపై తగిలి ప్రాణానికి ప్రమాదం జరిగి ఉండేదని డాక్టర్స్ చెప్పుకొచ్చారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి పాల్పడిన వ్యక్తి గురించి ఆరా తీస్తున్నారు.