NBK108 యూనిట్ కు ప్రమాదం ..

నందమూరి బాలకృష్ణ – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో NBK108 సినిమా తెరకెక్కుతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. అలాగే ‘అఖండ’ అద్భుతమైన సక్సెస్‌కు ఓ కారణమైన సంగీత దర్శకుడు ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో బాలకృష్ణ, అనిల్ రావిపూడి , ఎస్ థమన్ కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్రం కచ్చితంగా భారీ విజయాన్ని అందుకుంటుందని భావిస్తున్నారు.

కమర్షియల్ చిత్రాల ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి బాలయ్య డిఫరెంట్ కోణంలో ఎలివేట్ చేసేలా స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుని సినిమాను మొదలుపెట్టారు. సజావుగా షూటింగ్ జ‌రుగుతున్న ఈ సినిమా యూనిట్‌కు అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. జూనియ‌ర్ ఆర్టిస్టులు ప్ర‌యాణిస్తున్న వాహ‌నం ప్ర‌మాదానికి గురైన‌ట్లు స‌మాచారం. జూనియ‌ర్ ఆర్టిస్టులున్న వాహనం వెళుతుండగా ఆదివారం తెల్ల‌వారు జామున ప్రమాదవశాత్తు బోల్తాపడింది. న‌లుగురు జూనియ‌ర్ ఆర్టిస్టుల‌కు గాయాల‌య్యాయి. బాచుప‌ల్లి ద‌గ్గ‌ర ప్ర‌గ‌తి న‌గ‌ర్ చెరువు స‌మీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్ర‌మాద స్థ‌లానికి చేరుకున్న పోలీసులు వారిని ద‌గ్గ‌ర‌లోని హాస్పిట‌ల్‌కు చేర్చిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ప్రమాదం ఎలా జరిగిందనేది ఫై దర్యాప్తు మొదలుపెట్టారు.

ఇక ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వీర సింహ రెడ్డి మూవీ తో సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుండగా..థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.